బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన `క్షణ క్షణం`, గోవిందా గోవిందా , బావగారు బాగున్నారా, శంకర్ దాదా జిందాబాద్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుకు కూడా చేరువైన పరేష్ రావల్ తనకు కరోనా సోకిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
`దురదృష్ట వశాత్తు నాకు కోవిడ్ – 19 పాజిటివ్ అని తేలింది. గత 10 రోజుల కాలంలో నాతో సన్నిహితంగా మెలిగిన వారంతా పరీక్షించుకోవాలని కోరుతున్నాను` అని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో ఇటీవల ఆయనతో కాంటాక్ట్లో వున్న వాళ్లంతా పరీక్షలు చేయించుకోవడానికి పరుగులు పెడుతున్నారు. ఇదిలా వుంటే ఈ నెల 9న తను తొలి విడత కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఫొటోని ఇటీవల షేర్ చేశారు.
సెకండ్ వేవ్లో బాలీవుడ్ ప్రముఖులు వరుసగా వైరస్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. మిలింద్ సోమన్, మాధవన్, అమీర్ఖాన్, రణ్బీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్, మనోజ్ బాజ్ పాయ్ తదితరులు ఇటీవల తమకు కరోనా సోకినట్టు వెల్లడించిన విషయం తెలిసిందే.