Homeగాసిప్స్నాగ చైతన్య సినిమాను పక్కన పెట్టేసినట్లేనా?

నాగ చైతన్య సినిమాను పక్కన పెట్టేసినట్లేనా?

నాగ  చైతన్య సినిమాను పక్కన పెట్టేసినట్లేనా?
నాగ చైతన్య సినిమాను పక్కన పెట్టేసినట్లేనా?

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. గతేడాది రెండు సినిమాలతో హిట్లు అందుకున్న చైతూ తన మార్కెట్ ను సుస్థిరపరిచుకున్నాడు. ఈ ఏడాది శేఖర్ కమ్ముల చిత్రంతో మన ముందుకు రానున్నాడు. లవ్ స్టోరీ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ లో ఆలస్యం కారణంగా ఇప్పుడు జూన్ కు పుష్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ మధ్యే విడుదలైన పాట టీజర్ చిత్రంపై అంచనాలను బాగా పెంచేసింది. ఒక్క షాట్ లో నాగ చైతన్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ను జనాలు బాగా పొగుడుతున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జోడి కూడా బాగుందని అంటున్నారు. చూస్తుంటే లవ్ స్టోరీతో కూడా చైతూ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో పరశురామ్ తో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు చైతూ. గీత గోవిందం వంటి భారీ హిట్ తర్వాత ఆ దర్శకుడితో చైతూ సినిమా చేస్తుండడంతో ఈ మూవ్ చైతన్య కెరీర్ కు బాగా ప్లస్ అవుతుందని భావించారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను స్క్రాప్ చేసే ఉద్దేశంలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. దానికి కారణం మహేష్ బాబు అని అంటున్నారు.

- Advertisement -

అవును, మహేష్ – పరశురామ్ తో ఎప్పుడో సినిమా చేయాల్సింది, కానీ కుదరట్లేదు. అయితే మొదట వంశీ పైడిపల్లితో అనుకున్న సినిమా కాస్తా ఇప్పుడు ఉండట్లేదని తెలుస్తోంది. ఆ సినిమా స్థానంలో పరశురామ్ తో సినిమా చేయాలని మహేష్ డిసైడ్ అయినట్లు సమాచారం. మహేష్ సినిమా చేయమని ఆఫర్ ఇస్తే పరశురామ్ కూడా అటే వెళ్తాడు కదా. మహేష్ తో సినిమా అయ్యాక పరశురామ్ రేంజ్ మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు నాగ చైతన్యతో సినిమా చేస్తాడో చేయడో చెప్పలేం. అందుకే 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాను స్క్రాప్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు ఎంత వరకూ ఉన్నాయో తెలుసుకోవాలంటే మరికొంత కాలం ఎదురు చూడక తప్పదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All