వెండితెరపై ఆకట్టుకున్న సినిమాలు బుల్లితెరపై కూడా మంచి ఆదరణను చూరగొంటున్నాయి. అలాగే స్టార్స్తో సంబంధం లేకుండా కొత్త వాళ్లలో కొత్త కాన్సెప్ట్లతో కూపొందిన చిత్రాలు చాలా వరకు విజయాల్ని సాధించాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్లలోనూ తమ సత్తాని చాటుతున్నాయి. అలా ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రం `పలాస 1978` డిజిటల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంపల్ని సొంతం చేసుకుంది. 90వ దశకం నేపథ్యంలో పలాసలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం ద్వారా కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.
ఈ మూవీ విడుదలకు ముందే గీతా ఆర్ట్స్ 2లో కరుణకుమార్కు మరో సినిమా ఓకే అయ్యేలా చేసింది. విమర్శకులని సైతం మెప్పించిన ఈ చిత్రం ఇటీవల డిజిటల్ ఓటీటీ అయిన అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. యదార్ధ సంఘటనలకు కల్పిత సన్నివేశాల్ని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్లోనూ ఆడియన్స్ని ఆకట్టుకుంటోంది. థియేటర్స్లో మిస్సయిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పించారు.