Homeటాప్ స్టోరీస్212 కోట్లు వసూల్ చేసిన చిత్రం

212 కోట్లు వసూల్ చేసిన చిత్రం

బాలీవుడ్ లో అత్యంత వివాదాస్పద చిత్రం ” పద్మావత్ ” , సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ కి ముందే దేశ వ్యాప్తంగా కర్ణిసేన భీభత్సం సృష్టించింది . అయితే తాజాగా ఆ గొడవలు సద్దుమణిగాయి ఇక ఇప్పుడు ఈ సినిమా సాధిస్తున్న భారీ వసూళ్ల ని చూసి ట్రేడ్ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు . రెండు వారాల్లో 212 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించి అగ్ర హీరోలకు ఏమాత్రం తీసిపోను అంటూ తన సత్తా ఏంటో చాటిచెప్పింది దీపికా పడుకునే . మొదటి వారంలో 166 కోట్ల ని కలెక్ట్ చేసిన పద్మావత్ రెండో వారంలో 46 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది .

దాంతో రెండు వారాల్లోనే 212 కోట్ల పైచిలుకు వసూళ్ల ని సాధించి మూడో వారంలో కూడా మంచి వసూళ్ల ని సాధిస్తోంది . దీపికా పడుకునే , షాహిద్ కపూర్ , రణవీర్ సింగ్ లు ప్రధాన పాత్రలు పోషించిన పద్మావత్ చిత్రం ఉత్తర భారతాన్ని వణికించింది , కర్ణిసేన భీభత్సం సృష్టించి ఇప్పుడేమో పద్మావత్ చాలా గొప్ప సినిమా అని అంటున్నారు విచిత్రంగా . సినిమా చూడకుండానే గొడవలు చేసి కోట్లాది రూపాయల ఆస్థి నష్టం అయ్యేలా చేసారు కర్ణిసేన .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All