హైదరాబాద్ లో నీళ్ల కొరత ఉండటంతో ఈనెల 21 న కేవలం ఒక బకెట్ నీళ్ల తోనే స్నానం చేయడం , పళ్ళు తోముకోవడం లాంటి పనులు చేయాలనే ఛాలెంజ్ మొదలయ్యింది . దాంతో ఆ ఛాలెంజ్ ని స్వీకరించడానికి పలువురు హీరోలు , హీరోయిన్ లు ముందుకు వచ్చారు . ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసిన వాళ్లలో సమంత , వరుణ్ తేజ్ , సాయిధరమ్ తేజ్ , అడవి శేష్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , దర్శకులు నాగ్ అశ్విన్ తదితరులు ఉన్నారు .
వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా పలువురు ఈ వన్ బకెట్ ఛాలెంజ్ పై ఆసక్తితో ఉన్నారు . ఇప్పటికే చెన్నై లో నీళ్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు . సెలబ్రిటీలకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు కానీ వాళ్ళ అభిమానులను అలాగే ఇతరులకు అవగాహన కల్పించడానికే వాళ్ళు ఇలా వన్ బకెట్ ఛాలెంజ్ కు సిద్ధమయ్యారు . అంటే నీళ్ళని వృధా చేయకండి ,పొదుపుగా నీటిని వాడండి అని చెప్పడానికే ఈ ఛాలెంజ్ .
Who’s with me ? This Sunday.. One bucket challenge.. ?? (with pictures) .. no long showers , no washing vehicles , no leaving the tap on while you wash your face ….. I will post a pic of my bright blue bucket as well ? (no cheating) #everydropcounts pic.twitter.com/oP2Affd0OD
— Samantha Akkineni (@Samanthaprabhu2) July 18, 2019