దర్శకుడిగా ఓంకార్ ను ప్రేక్షకులకు దగ్గర చేసింది రాజు గారి గది అనే సినిమా. హారర్ కామెడీలకు ప్రేక్షకాదరణ మస్తుగా లభిస్తున్న టైమ్ లో 2015 లో విడుదలైన రాజు గారి గది సంచలన విజయాన్ని అందుకుంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ లాభాలని అందించింది.
అయితే ఆ తర్వాత రెండేళ్లకు 2017 లో విడుదలైన రాజు గారి గది 2 మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఈ చిత్రంలో నాగార్జున, సమంత కీలకపాత్రలు పోషించినా కానీ కథ మరీ పేలవంగా ఉండడంతో పరాజయం పాలుకాక తప్పలేదు. అయితే ఓంకార్ తన ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోవట్లేదు. సరిగ్గా మళ్ళీ రెండేళ్లకు రాజు గారి గది 3 చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాడు.
అది కూడా ఈ చిత్రాన్ని అక్టోబర్ లోనే విడుదల చేయాలని ప్లాన్ చేసాడు. అవికా గోర్ ఈ చిత్రంలో లీడ్ పాత్రలో కనిపించనుంది. మరి రాజు గారి మూడో గదిలోనైనా సొమ్ములు ఉన్నాయో లేదో తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.