Homeటాప్ స్టోరీస్భీమ్లా దెబ్బకు మెట్టు దిగిన బుక్ మై షో..

భీమ్లా దెబ్బకు మెట్టు దిగిన బుక్ మై షో..

భీమ్లా దెబ్బకు మెట్టు దిగిన బుక్ మై షో..
భీమ్లా దెబ్బకు మెట్టు దిగిన బుక్ మై షో..

భీమ్లా నాయక్ దెబ్బకు బుక్ మై షో మెట్టు దిగింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో టికెట్ ధరల విషయంలో అదనపు చార్జీలు తగ్గించుకోవాలని నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్స్  బుక్ మై షో ను కోరారు. కానీ వారు మాత్రం తగ్గిదేలే అని చెప్పడం తో..భీమ్లా నాయక్ టికెట్స్ ను నేరుగా థియేటర్స్ లోనే అమ్మెందుకు డిసైడ్ అయ్యారు. అలానే మొదలుపెట్టారు. దీంతో బుక్ మై షో మెట్టు దిగింది.

‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాన్ని మిస్ అయితే.. భారీగా నష్టపోవడం ఖాయం అని భావించిన ‘బుక్ మై షో’ సంస్థ..డిస్ట్రిబ్యూటర్ చెప్పిన కండిషన్ల కు ఓకే చెప్పారు. సర్వీస్ ఛార్జీలను 11 శాతం కాకుండా, థియేటర్లని బట్టి 5 లేదంటే 6 శాతానికి తగ్గించేలా ‘బుక్ మై షో’ సంస్థ అంగీకరించినట్లుగా సమాచారం. చర్చలు సఫలం అవడంతో.. వెంటనే బుక్ మై షో ‘భీమ్లా నాయక్’కు బుకింగ్స్ ఓపెన్ చేసింది. అలా ఓపెన్ చేశారో లేదో.. హాట్ కేకులా అన్నీ అయ్యిపోయాయి.  ‘బుక్ మై షో’ బుకింగ్ ఓపెన్ అవడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

పవన్ కళ్యాణ్ , రానా కలయికలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాగర్ డైరెక్ట్ చేయగా..త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లు గా నటించగా థమన్ మ్యూజిక్ అందించారు. సోమవారం విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తుంది. ఇక రేపు సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All