అంత అనుకున్నట్లే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా వాయిదా పడింది. శర్వానంద్ – రష్మిక జంటగా కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ ని ఫిబ్రవరి 25 న విడుదల చేయాలనీ అనుకున్నారు. దానికి తగ్గట్లే అన్ని ఏర్పట్లు చేసుకొని , ప్రమోషన్ మొదలుపెట్టారు. కానీ సడెన్ గా భీమ్లా నాయక్ అదే డేట్ కు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన రావడంతో సినిమాను మార్చి 04 కు వాయిదా వేయకతప్పలేదు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కుటుంబ సమేతంగా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగేలా ఈ చిత్రానికి క్లీన్ ‘యు’ (U) సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ విషయాన్నీ తెలుపుతూ రిలీజ్ డేట్ మారినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపారు.
ఖుష్బు – రాధిక శరత్ కుమార్ – ఊర్వశి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ – రవిశంకర్ – సత్య – ప్రదీప్ రావత్ – గోపరాజు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అసలైన ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు.
#AadavalluMeekuJoharlu is all set to entertain ‘U’ and your family in Theaters Worldwide from MARCH 4th ❤️#AMJOnMarch4th @iamRashmika @DirKishoreOffl @ThisIsDSP @sujithsarang @SLVCinemasOffl @LahariMusic @TSeries pic.twitter.com/DC6JnqFZFk
— Sharwanand (@ImSharwanand) February 19, 2022