సోషల్ మీడియా వాడకం పెరిగిన తరువాత ఎవరు ఏది పోస్ట చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. దీంతో సెలబ్రిటీలే కాకుండా పొలిటికల్ లీడర్స్ కూడా ఏ విషయంపై అయినా పోస్ట్ పెట్టాలంటే భయంతో వణకిపోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చాల ఆవరకు సెలబ్రిటీలు, వారి పిల్లులు, పొలిటికల్ లీడర్లు సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కై వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఇద్దరు హీరోయిన్లు, ఓ పొలిటికల్ లీడర్ కూతురు హద్దులు దాటి ప్రవర్తించి సోషల్ మీడియా కారణంగా అడ్డంగా బుక్కయ్యారు.
ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబ కిషోర్ దాస్ కుమార్తె దీపాలి దాస్, ఒరిస్సా సినీరంగానికి చెందిన ఇద్దరు హీరోయిన్లు ప్రకృతి మిశ్రా, ఎలినా సమంత్రే ఓ కార్యక్రమం కోసం సంబాల్ పూర్ వెళ్లారు. ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత హీరాకూడ్ డ్యామ్ని సందర్శించిన వీరు అక్కడి నిషేధిత ప్రాంతానికి వెళ్లి సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు దిగుతూ నానా హంగామా చేశారు. ఆ ఫొటోలని హీరోయిన్ ప్రకృతి మిశ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం మొతలైంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ మండిపడుతున్నారు.
మంత్రి కూతురు అయితే ఏంటి నిబంధనలు పాటించరా అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఒడిశా పోలీసులు ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ని దర్యాప్తుకు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై ఒడిశా మంత్రి నబ కిషోర్ దాస్ స్పందించారు. తన కుమార్తె మైనర్ కాదని, ఈ విషయంలో తన గురించి స్పందించనని వెల్లడించారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడతామని హీరోయిన్లు తెలిపారు.