Homeటాప్ స్టోరీస్నిషేధిత ప్రాంతంలో హీరోయిన్‌ల హంగామా!

నిషేధిత ప్రాంతంలో హీరోయిన్‌ల హంగామా!

నిషేధిత ప్రాంతంలో హీరోయిన్‌ల హంగామా!
నిషేధిత ప్రాంతంలో హీరోయిన్‌ల హంగామా!

సోష‌ల్ మీడియా వాడ‌కం పెరిగిన త‌రువాత ఎవ‌రు ఏది పోస్ట చేసినా క్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోతోంది. దీంతో సెల‌బ్రిటీలే కాకుండా పొలిటిక‌ల్ లీడ‌ర్స్ కూడా ఏ విష‌యంపై అయినా పోస్ట్ పెట్టాలంటే భ‌యంతో వ‌ణ‌కిపోతున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో చాల ఆవ‌ర‌కు సెల‌బ్రిటీలు, వారి పిల్లులు, పొలిటిక‌ల్ లీడర్లు సోష‌ల్ మీడియాలో అడ్డంగా బుక్కై వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఇద్ద‌రు హీరోయిన్‌లు, ఓ పొలిటిక‌ల్ లీడ‌ర్ కూతురు హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించి సోష‌ల్ మీడియా కార‌ణంగా అడ్డంగా బుక్క‌య్యారు.

ఒడిశా ఆరోగ్య‌శాఖ మంత్రి న‌బ కిషోర్ దాస్ కుమార్తె దీపాలి దాస్‌, ఒరిస్సా సినీరంగానికి చెందిన ఇద్ద‌రు హీరోయిన్‌లు ప్ర‌కృతి మిశ్రా, ఎలినా స‌మంత్రే ఓ కార్య‌క్ర‌మం కోసం సంబాల్ పూర్ వెళ్లారు. ఆ కార్య‌క్ర‌మం పూర్త‌యిన త‌రువాత హీరాకూడ్ డ్యామ్‌ని సంద‌ర్శించిన వీరు అక్క‌డి నిషేధిత‌ ప్రాంతానికి వెళ్లి సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు దిగుతూ నానా హంగామా చేశారు. ఆ ఫొటోల‌ని హీరోయిన్ ప్ర‌కృతి మిశ్రా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వివాదం మొత‌లైంది. ఈ ఫొటోలు చూసిన నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు.

- Advertisement -

మంత్రి కూతురు అయితే ఏంటి నిబంధ‌న‌లు పాటించ‌రా అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఒడిశా పోలీసులు ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్‌ని ద‌ర్యాప్తుకు ఆదేశించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ వివాదంపై ఒడిశా మంత్రి న‌బ కిషోర్ దాస్ స్పందించారు. త‌న కుమార్తె మైన‌ర్ కాద‌ని, ఈ విష‌యంలో త‌న గురించి స్పందించ‌న‌ని వెల్ల‌డించారు. మ‌రోసారి ఇలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తామ‌ని హీరోయిన్‌లు తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All