యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లే ప్లాన్స్ లో ఉన్నాడు. ఇప్పటికే టాలీవుడ్ వరకూ ఎన్టీఆర్ కు తిరుగులేని ఇమేజ్ ఉంది. ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకోవడం ఖాయం. ఈ నేపథ్యంలో తన తర్వాతి చిత్రాలు కూడా ప్యాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అయినను పోయి రావాలె హస్తినకు అనే ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ చేయనున్న విషయం తెల్సిందే.
దీని తర్వాత కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా చేయడం దాదాపు కన్ఫర్మ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తమ తమ కమిట్మెంట్స్ ను పూర్తి చేసిన తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సినిమా పట్టాలెక్కనుంది.
ఇక తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 32వ ప్రాజెక్ట్ పై ఒక క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. ఎప్పటినుండో అనుకుంటున్నట్లే ప్రముఖ దర్శకుడు అట్లీతోనే ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఉంటుందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి మరో మూడేళ్లు పట్టే అవకాశాలు ఉన్నాయి. సో వచ్చే ఏడాదికి ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.