దక్షిణాదిలో పాపులర్ డైరెక్టర్ గా పేరున్న దర్శకుడు శంకర్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావడం కలకలం రేపుతోంది. 2010 శంకర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ `రోబో`. తమిళంలో ఈ చిత్రాన్ని `ఎందిరన్` పేరుతో రూపొందించారు. సన్ పిక్చర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలిచి రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమా కథపై గత కొంత కాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. పలు మార్లు శంకర్ని కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించినా శంకర్ పెద్దగా స్పందించలేదు. ఈ కేసుని సీరియస్గా సరిగణించిన ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ II శంకర్పై నాన్ బెయిలెబుల్ వారెంట్ని ఇష్యూ చేసింది.
శంకర్ను కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. రచయిత అరుర్ తన ఫిర్యాదులో శంకర్ కాపీరైట్ చట్టం, 1957 ను ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ చిత్రం విజయం నుండి శంకర్ మరియు అతని బృందం కూడా భారీగా డబ్బు సంపాదించారని ఆయన ఫిర్యాదు చేశారు. తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ పై శంకర్ ఇంకా స్పందించలేదు.