నిత్యామీనన్ విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. సెలెక్టీవ్గా సినిమాలు చేస్తూ వస్తోంది. మరో బయోపిక్ని రిజెక్ట్ చేసినట్టు తెలిసింది. గీత గోవిందం, ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాల్లో ప్రత్యేక అతిథి పాత్రల్లో నటించిన నిత్యామీనన్ ఈ మధ్య మరే తెలుగు చిత్రాన్ని అంగీకరించలేదు. తాజాగా ఆమె ఓ తెలుగు చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
తొలి భారతీయ మహిళా వెయిట్ లిప్టర్ కరణం మల్లేశ్వరి జీవిత కథ ఆధారంగా కోన వెంకట్, ఎం.వి.వి. సత్యనారాయణ ఓ బయోపిక్ని తెరపైకి తీసుకురానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంజన రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇటీవలే కరణం మల్లేశ్వరి పుట్టిన రోజు సందర్భంగా వెల్లడించింది.
ఈ చిత్రంలో కరణం మల్లేశ్వరి పాత్రని ఎవరు చేస్తారా అనే చర్చ మొదలైంది. మేకర్స్ నిత్యామీనన్ని ఆ పాత్ర కోసం సంప్రదించారట. అయితే నిత్యామీనన్ మాత్రం తన వద్దకు వచ్చిన ఆఫర్ని సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. కారణం ఏంటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆ మధ్య `మహనటి` చిత్రాన్ని కూడా నిత్యామీనన్ తిరస్కరించిన విషయం తెలిసిందే.