ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధాకా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ ఫిల్మ్ `అంధాధూన్`. బాలీవుడ్లో సంచలన విజయం సాధించి జాతీయ స్థాయిలో నటుడు ఆయుష్మాన్ ఖురానాకు ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని అందించడమే కాకుండా విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.
నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై సుధాకర్రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మేర్ల పాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా, నభా నటేష్ కాలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీ రిలీజ్ డేట్ని తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. వరుసగా ప్రతీ హీరో తమ సినిమా రిలీజ్ డేట్ని ప్రకటిస్తున్న నేపథ్యంలో నితిన్ `అంధాధూన్` తెలుగు రీమేక్ రిలీజ్ డేట్ని కూడా శుక్రవారం ప్రకటించారు.
ఈ మూవీని జూన్ 11న రిలీజ్ చేస్తున్నారు. జూన్ 19న అఖిల్ నటిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ తప్ప నితిన్కి మరో సినిమా పోటీ లేదు. దీంతో ఈ డేట్ని ఫిక్స్ చేసుకున్నారట. ఇదిలా వుంటే నితిన్ నటిస్తున్న మరో చిత్రం `చెక్` ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
JUNE 11th is the Date!!
#Nithiin30@tamannaahspeaks @NabhaNatesh @GandhiMerlapaka @SreshthMovies_ pic.twitter.com/jTGdMRLslA
— nithiin (@actor_nithiin) February 19, 2021