ఛలో వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ – రష్మిక మందన్న జంటగా భీష్మ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రం రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది . శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత నితిన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు . వరుసగా నితిన్ చేస్తున్న సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో పది నెలల అనంతరం ఈ భీష్మ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .
ఇక ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది . ఇప్పటికే మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న ఈ భామకు భీష్మ చిత్రంలో మంచి పాత్ర లభించిందని సంతోషంగా ఉంది . వరుస షెడ్యూల్ లతో చిత్రాన్ని పూర్తిచేసి ఈ ఏడాది ఆఖరులో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
- Advertisement -