Homeటాప్ స్టోరీస్నితిన్ ఓ రేంజ్ లో వాడుతున్నాడుగా

నితిన్ ఓ రేంజ్ లో వాడుతున్నాడుగా

నితిన్ ఓ రేంజ్ లో వాడుతున్నాడుగా
నితిన్ ఓ రేంజ్ లో వాడుతున్నాడుగా

యంగ్ హీరో నితిన్ కు ఇప్పుడు ఒక హిట్ చాలా అవసరం. ఇష్క్ సినిమాతో డజను ప్లాపులకు అడ్డుకట్ట వేసుకున్న నితిన్ ఆపై మంచి హిట్లే కొట్టాడు. హీరోగా కెరీర్ నెక్స్ట్ లెవెల్ కు వెళుతోంది అన్న సమయంలో మళ్ళీ వరస ప్లాపులు నితిన్ కెరీర్ ను కిందకి లాగేసాయి. గత రెండు, మూడేళ్లు నితిన్ కు పెద్దగా కలిసి రాలేదు. వరసగా లై, చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం సినిమాలు ప్లాప్ అవ్వడంతో నితిన్ కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితిలో పడ్డాడు.

2019లో ఒక్క సినిమా కూడా విడుదల చేయని నితిన్, 2020లో పక్కా ప్లానింగ్ తో వస్తున్నాడు. ముందుగా ఈ నెల 21న భీష్మ విడుదలవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర అ..ఆ సినిమాకు పనిచేసిన వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. తన తొలి చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన నేపథ్యంలో రెండో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్. ఈ సినిమా కోసం నితిన్ ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకపోవడం విశేషం. సినిమాకు హైప్ తీసుకురావడానికి ఏం చేయాలో అంతా చేస్తున్నాడు నితిన్.

- Advertisement -

ఇదివరకు కూడా నితిన్ పవన్ కళ్యాణ్ ను తెగ వాడేవాడు. ఇష్క్ సినిమా నుండి ఈ వాడకం మొదలైంది. అవసరమైన చోట స్పేస్ తీసుకుని తన అభిమానం చూపించేవాడు. భీష్మ విషయంలో తన అభిమానం కొంచెం ఎక్కువగానే ప్రదర్శించాడు. ముందుగా రెట్రో సాంగ్ కోసం విజేతలో చిరుని పోలిన లుక్ తో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వీడియో సాంగ్ లో ఖుషీ దీపం సీన్ ను అనుకరించి పవన్ ఫ్యాన్స్ ను బుట్టలో వేసుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ముఖ్య అతిధిగా పిలిచాడు. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ఇప్పుడు బాగా హల్చల్ చేస్తోంది. అందుకని తను వస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నాడు. మొత్తానికి ఒక హిట్టు కోసం ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. మరి భీష్మ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All