కరోనా కారణంగా తెలుగు సినిమా ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. లాక్డౌన్ విధించడంతో థియేటర్లు మూతపడ్డాయి.., షూటింగ్లు ఆగిపోయాయి. సగానికి పైగా పూర్తయి ఆగిపోయిన సినిమాలు కొన్ని, అన్నీ పూర్తయి రిలీజ్కు రెడీ అయిన సినిమాలు కొన్ని ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ఇదీ చాలదన్నట్టు ఓటీటీ కత్తి తెలుగు సినిమాపై వేళ్లాడుతోంది.
ఎక్కడ ఓకే అంటే సినిమాల్ని టోకుగా కొనేయాలని ఓటీటీ కంపెనీలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. భారీ ఆఫర్లు గుప్పిస్తున్నాయి. ప్రొడ్యూసర్స్ని ఒక విధింగా టెమ్ట్ చేస్తున్నాయి. కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం ఆ ఆఫర్లకు తలొగ్గడం లేదు. ఆరు నూరైనా తమ చిత్రాల్ని థియేటర్స్లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నామని కుండ బద్దలుకొట్టి చెప్పేస్తున్నారు.
అనుష్క నటించిన తాజా చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్నిడైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. అమెజాన్ ప్రనేమ్ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్టు కూడా తెలిసింది. అయితే నిర్మాతలు మాత్రం ఓటీటీలో తమ చిత్రాన్ని రిలీజ్ చేసేది లేదని చెప్పేశారట. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలిసింది. దర్శకుడు హేమంత్ మధుకర్ కూడా ఈ విషయాంలో క్లారిటీగా వున్నారు. రెండేళ్లు శ్రమించిన ఈ చిత్రాన్న ఇథియేటర్లో రిలీజ్ చేయడానికే ఇష్టపడుతున్నామని, ఓటీటీలో రిలీజ్ చేయాలనుకోవడం లేదని వెల్లడించారు. అనుష్క కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. నిర్మాత ఏ నిర్ణయంతీసుకుంటే అదే ఫైనల్ అని, ఇక ఈ సినిమాపై ఓటీటీ చర్చ ఆపండని వెల్లడించినట్టు తెలిసింది. అంటే టీమ్ అంతా నిశ్శబ్దంగా థియేటర్కే జైకొట్టారన్నమాట.