Homeటాప్ స్టోరీస్పెళ్లి విషయంలో తగ్గేదే లేదంటున్న నిఖిల్

పెళ్లి విషయంలో తగ్గేదే లేదంటున్న నిఖిల్

పెళ్లి విషయంలో తగ్గేదే లేదంటున్న నిఖిల్
పెళ్లి విషయంలో తగ్గేదే లేదంటున్న నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ గతేడాది అర్జున్ సురవరం సినిమాతో మళ్ళీ ఫామ్ అందుకున్నాడు. తన సంతోషం మరింత రెట్టింపయ్యేలా ఇటీవలే ఫిబ్రవరి 1న తన స్నేహితురాలు పల్లవితో నిఖిల్ కు నిశ్చితార్ధం జరిగిన విషయం తెల్సిందే. స్నేహితుల ద్వారా ఈ ఇద్దరూ కలుసుకోగా గత కొన్నేళ్ల నుండీ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. గతేడాది చివర్లో తమ రిలేషన్ ను పెళ్లి పీటలెక్కించాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. పెద్దల అనుమతితో నిశ్చితార్థం కూడా చేసుకుని ఏప్రిల్ 16న పెళ్ళికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇంతవరకూ అంతా సజావుగా జరగ్గా ఇప్పుడు కరోనా వైరస్ భయం వల్ల ఏ నలుగురు ఒకచోట కలుసుకోవడానికి ఇష్టపడట్లేదు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా యాక్టివ్ గా ఉంది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన సంగతి తెల్సిందే. పాఠశాలలు, కాలేజీలను ఈ నెలాఖరు దాకా మూసి వేశారు. అలాగే థియేటర్లు కూడా ఒక వారం కూడా మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే నిఖిల్ ను మీడియా కలిసి తన పెళ్లి విషయంలో ప్రశ్నించింది.

- Advertisement -

ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా పెళ్లి వాయిదా వేసే ఉద్దేశమేమైనా ఉందా అని అడగ్గా తనకు అలాంటి ఉద్దేశమేమి లేదని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి వాయిదా పడదని తెలిపాడు. అవసరమైతే అప్పటి పరిస్థితులను బట్టి గుళ్లో చిన్నగా అయినా చేసుకుంటాం కానీ పెళ్లి వాయిదా అయితే వెయ్యమని తేల్చి చెప్పేసాడు. ఇప్పటికే పెళ్ళికి సంబంధించిన పనులు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పెళ్ళికి పిలవాల్సిన గెస్ట్ లిస్ట్ ను సిద్ధం చేస్తున్నారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే కార్తికేయ 2 చిత్రాన్ని ఇటీవలే లాంచ్ చేసిన విషయం తెల్సిందే. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కు వెళ్లనుంది. అలాగే ఈ ఏడాది 18 పేజెస్ లో కూడా నటించనున్నాడు. కుమారి 21ఎఫ్ దర్శకుడు సూర్య కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడు. సుకుమార్ కథ అందించాడు. అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All