`అర్జున్ సురవరం` ట్రెమండస్ హిట్తో యంగ్ హీరో నిఖిల్ యమ జోష్లో వున్నాడు. ఇటీవల తనకి ఎంగేజ్మెంట్ జరిగి పెళ్లి కూడా కుదరడంతో రెట్టించిన ఉత్సాహం అతనిలో తొణికిసలాడుతోంది. ఈ జోష్తోనే వరుసగా రెండు చిత్రాల్ని మొదలుపెట్టేశాడు. చందూ మొండేటితో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం `కార్తికేయ` చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న `కార్తికేయ 2`ని ఇటీవలే తిరుపతిలో మొదలుపెట్టిన నిఖిల్ తాజాగా మరో చిత్రాన్ని స్టార్ చేస్తున్నాడు.
వరుసగా క్రేజీ చిత్రాల్ని ప్రకటిస్తుస్తూ హాట్ టాపిక్గా మారిన నిఖిల్ తాజా చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై అల్లు అరవింద్ సమర్పణలో చేస్తున్న విషయం తెలిసిందే. `కుమారి 21 ఎఫ్` ఫేమ్ సూర్యప్రతాప్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ నెల 5న గురువారం ఉదయం 9 గంటలకు ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించినట్టు చిత్ర బృందం ప్రకటించింది.
బన్నీవాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి `18 పేజెస్` అనే వెరైటీ టైటిల్ని ఫిక్స్ చేశారు. లెక్కల మాస్టారు సుకుమార్ కూడా ఈ ప్రాజెక్ట్ కు యాడవ్వడంతో వెరైటీ టైటిల్ వుంటుందని అంతా ముందే ఊహించారు. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రానికి `18 పేజెస్` అనే వెరైటీ టైటిల్ని ఫిక్స్ చేశారు. టైటిల్ భలే గమ్మత్తుగా వుంది కదూ.. సినిమా కూడా అంతే గమ్మత్తుగా కొత్తగా వుంటుందట.