మెగా డాటర్ కొణిదెల నిహారిక వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. వచ్చే నెల గుంటూరుకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకరరావు తనయుడు జొన్నలగడ్డ చైతన్యతో జరగబోతోంది. ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్లో వివాహం అని అప్పుడే మెగా బ్రదర్ నాగబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న నిహారిక , చైతన్యల వివాహం జరగబోతోంది.
ఇప్పటికే రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఉదయ్ విలాస్ని సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే అక్కడికి వెళ్లిన వెడ్డింగ్కి సంబంధించిన వెడ్డింగ్ ప్లానర్ బృందానికి పెళ్లి పనుల్ని అప్పగించేసింది. పెళ్లి డేట్ ఫిక్స్ కావడంతో నిత్యం పార్టీలతో బిజీగా గడిపేస్తున్న నిహారిక ఇటీవల తన ఫ్రెండ్స్ కి గోవాలో బ్యాచిలర్ పార్టీని ఇచ్చింది.
తాజాగా ఉదయ్పూర్ నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న నిహారిక తన కజిన్స్కి గ్రాండ్గా పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో చిరు డాటర్స్ సుష్మిత, శ్రీజతో పాటు మెగా ఫ్యామిలీకి అత్యంత బధువులైన వారి పిల్లలు కూడా వున్నారు. ఉదయ్పూర్లో జరిగే నిహారిక వివాహానికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ దాదాపుగా హాజరు కానున్నారని తెలిసింది.