టాలీవుడ్లోకి `ఫిలిమ్` పేరుతో మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎంటరవుతోంది. ఇప్పటికే కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్లు వుండగా తెలుగులో కొత్తగా `ఫిలిమ్` ఓటీటీ ఎంటర్ కాబోతోంది. దీని ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత వినోదం అందుబాటులోకి రాబోతోంది. ఈ ఓటీటీలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు అందుబాటులోకి రానున్నాయి.
ఇతర ఓటీటీ ప్లాట్ ఫామ్లతో పోలిస్తే ఫిలిమ్ ఓటీటీ సబ్ స్క్నిప్షన్ చార్జీలు తక్కువ. తక్కువ చార్జీతో ఈ ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్లు అందుబాటులోకి రాబోతున్నాయి. కొంత మంది ఔత్సాహిక యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ కలిసి ఓ టీమ్గా ఫామ్ అయి తెలుగు ప్రేక్షకుల కోసం సరికొత్త వినోదాన్ని పంచడం కోసం `ఫిలిమ్` ఓటీటీని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.
విజయదశమి సందర్భంగా ఈ ఓటీటీ ప్రారంభం కాబోతోంది. ఇందులో తొలిసారి విజయ్ సేతుపతి నటించిన `పిజ్జా 2`, తమిళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన `రంగూన్ రౌడీ`, ప్రియమణి నటించిన `విస్మయ` వంటి క్రేజీ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇందులో తొలి చిత్రంగా విజయ్ సేతుపతి `పిజ్జా 2`
స్ట్రీమింగ్ కానుంది. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గాయత్రి హీరోయిన్గా నటించింది. ఈ ఓటీటీలో రిలీజ్ కానున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు వాటి రిలీజ్ల వివరాలు, పాటలు, టీజర్స్, ట్రైలర్స్ `ఫిలిమ్` యూట్యూబ్లో అందుబాటులో వుండనున్నాయని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.