న్యాచురల్ స్టార్ నాని తన రీసెంట్ రెండు సినిమాలను కూడా డైరెక్ట్ ఓటిటిలోనే విడుదల చేసాడు. వి, టక్ జగదీష్ థియేటర్స్ లో విడుదల కాకుండా ఓటిటి రూట్ తీసుకున్నప్పుడు వివాదాలు వచ్చాయి. దీంతో నాని తన తర్వాతి చిత్రాన్ని కచ్చితంగా థియేటర్స్ లోనే విడుదల చేస్తానని లేదంటే సినిమాల నుండి తప్పుకుంటానని మాట ఇచ్చాడు.
నాని పూర్తి చేసిన చిత్రం శ్యామ్ సింగ రాయ్. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధర చెల్లించి చేజిక్కించుకుంది. కేవలం డిజిటల్ రైట్స్ అమ్మడం ద్వారా నాని క్లియర్ గా సంకేతాలు ఇచ్చినట్లు అయింది. శ్యామ్ సింగ రాయ్ కచ్చితంగా థియేటర్స్ లోనే విడుదల కానుంది. త్వరలోనే థియేట్రికల్ రైట్స్ ను కూడా క్లోజ్ చేస్తారు.
రాహుల్ సంకిట్ర్యాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మించగా మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించాడు. పూర్తిగా కోల్కతా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం సాగుతుంది.
Netflix has acquired the post theatrical rights of Natural Star #Nani‘s #ShyamSinghaRoy.
— Manobala Vijayabalan (@ManobalaV) September 23, 2021