సోషల్ మీడియాని బాలీవుడ్ హీరోయిన్లు వాడుకుంటున్నట్టుగా ఎవరూ వాడుకోవడం లేదు. సినిమాల్లో బిజీగా వున్న వాళ్ల దగ్గరి నుంచి సినిమాలు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ల వరకు సోషల్ మీడియాని యధేచ్ఛగా వాడేస్తున్నారు, సినిమాలకు సబంధం లేకుండా నిత్యం వార్తల్లో వుంటూ సంచలనం సృష్టిస్తున్నారు. మెగా పవర్స్టార్ హీరోగా పరిచయమైన చిరుత చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది బీహారీ సోయగం నేహాశర్మ.
ఆ తరువాత తెలుగులో `కుర్రాడు` చిత్రంలో మాత్రమే కనిపించిన నేహా ఆ తరువాత టాలీవుడ్కు టాటా చెప్పేసి బాలీవుడ్ బాట పట్టేసింది. బాలీవుడ్ సీరియల్ కిస్సర్తో క్రూక్, ప్రియాంకా చోప్రాతో కలిసి `తేరీ మేరీ కహాని`, క్యా సూపర్ కూల్ హై హమ్, జయంతా బాబీకి లవ్ స్టోరీ వంటి చిత్రాల్లో నటించింది. చైనీస్ చిత్రంలోనూ నటించిన నేహాకు బాలీవుడ్లో మాత్రం రావాల్సిన గుర్తింపు రాలేదు. దీంతో సోషల్మీడియాని నమ్ముకుంది. హాట్ హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తూ సొషల్ మీడియాలో కావాల్సి నంత రచ్చ చేసేస్తోంది.
తాజాగా నేహాశర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ పిక్ వైరల్గా మారింది. రెడ్ కలర్ స్లీవ్ లెస్ ఔట్ ఫిట్లో అందాల విందు చేస్తున్న నేహా ఫొటో నెటిజన్స్ని ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోకి `లైఫ్ ఈజ్ పింక్` అనే క్యాప్షన్ని జతచేసింది. నేహాను ఇన్స్టాలో ఫాలో అవుతున్న వాళ్ల సంక్ష 9.2 మిలియన్. నేహా నటిస్తున్న తాజా చిత్రం `తన్హాజీ` జనవరి 10న రిలీజ్ కాబోతోంది. అజయ్ దేవ్గన్ హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.