మెగాస్టార్ చిరంజీవి ఇనేళ్ళ బ్రేక్ కి తెరపడి రెండు రోజుల క్రితం సైరా నరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఫుల్ పాజిటివ్ టాక్ ఈ చిత్రానికి రావడంతో ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ. రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా పక్కా హిట్ అనిపిస్తోంది. మెగా ఫ్యాన్స్ మొత్తానికి తమ బాస్ ను స్క్రీన్ పై ఇలా చూసుకుని పండగ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంచితే సైరా విషయంలో నయనతార గుర్రుగా ఉందని అంటున్నారు. ఈ సినిమా మేకింగ్ అప్పుడూ, విడుదలకు ముందు కూడా ఇందులో నయన్ మెయిన్ పాత్రని, తమన్నాకు పెద్ద ప్రాధాన్యత ఏం లేదనే అనుకున్నారు. అయితే స్క్రీన్ ప్రెజన్స్ విషయంలోనూ, పాత్ర ప్రాధాన్యత విషయంలోనూ నయన్ కంటే తమన్నాకే ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంది.
ఈ విషయంలో తమన్నా ఫుల్ హ్యాపీ, మరోవైపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్రలో నటించిన నయన్ మాత్రం తనకు ఎక్కువ ప్రాధాన్యత దక్కని కారణంగానే ఎవరెంత బ్రతిమాలినా కూడా ప్రమోషన్స్ కు దూరంగానే ఉంటూ వస్తోంది. సైరా యూనిట్ పై నయన్ అందుకే గుర్రుగా ఉందట.