కోలీవుడ్ హాట్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ గత కొంత కాలంగా చెన్నైలోని ఒకే ఇంట్లో వుంటూ సహజీవనం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ పెళ్లి మాట ఎత్తని ఈ లవ్బర్డ్స్ ప్రస్తుతం హైదరాబాద్లో హల్చల్ చేస్తున్నారు. సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తమిళ చిత్రం `అన్నాతే`లో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `సిరుతై` శివ దర్శకత్వం వహిస్తున్నారు.
గత ఎనిమిది నెలలుగా లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మళ్లీ మొదలైంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇందు కోసం ప్రియుడు విగ్నేష్ శివన్తో కలిసి నయనతార హైదరాబాద్ వచ్చేసింది. విగ్నేష్ శివన్ తను తెరకెక్కిస్తున్న తాజా చిత్ర షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది. దీంతో ఇద్దరూ ఒకే చోట చేరిపపోయారు. వీకెండ్లో షూటింగ్కి బ్రేక్ లభించడంతో హైదరాబాద్లో వున్న చారిత్రక కట్టడాలని సందర్శిస్తున్నారట.
హైదరాబాద్లోని ఓ లగ్జరీ హోటల్లో ఈ ప్రేమ జంట ఒంటరిగా కనిపించడంతో ఫొటో గ్రాఫర్లకి చిక్కారట. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇదిలా వుంటే తాజాగా `అన్నాతే` యూనిట్ సభ్యులు షూటింగ్ పూర్తయ్యేంత వరకు బయటి వ్యక్తుల్ని యూనిట్ మెంబర్స్ కలవకూడదని నిబంధన పెట్టారట. అంటే `బయో బబుల్` అన్నమాట. దీంతో నయన ఇకపై ఈ షూటింగ్ పూర్తయ్యే వరకు బాయ్ఫ్రెండ్తో కలవడం కష్టమే అంటున్నారు.