బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ గత కొంత కాలంగా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. వెండితెరపై తనదైన విలక్షణ అభినయంతో ఆకట్టుకుంటూ విమర్శకుల ప్రశంసలతో పాటు పాలు అవార్డుల్నీ దక్కించుకుంటున్నారు. అయితే రియల్ లైఫ్లో మాత్రం ఆయన వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శలకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన తన భార్య కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు.
వివాహేతర సంబంధాల కారణంగా నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతని భార్య అలియా మధ్య అభిప్రాయ భేధాలు మొదలయ్యాయి. అవి విడాకుల దాకా వెళ్లాయి. ఈ ఇద్దరికి ఇద్దరు పిల్లులు కూడా వున్నారు. అయినా విడాకుల కోసం ఇద్దరూ రాజీపడటం లేదు. ఇటీవలే డైవర్స్ కోసం కోర్టుని ఆశ్రయించారు. త్వరలోనే విడాకులు రానున్నాయట. దీంతో బాలీవుడ్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ హాట్ టాపిక్గా మారాడు.
ఇదిలా వుంటే నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫ్యామిలీ కోర్టులో పిల్లల కోసం పిటీషన్ వేయబోతున్నట్టు తెలిసింది. విడాకుల తరువాత పిల్లలు తనతో మాత్రమే వుండాలని నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ వేస్తుండటం హాట్ టాపిక్గా మారింది.