నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షో `జాతిరత్నాలు`. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రంతో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి మ్యాజిక్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద నవ్వులు పూయిస్తున్నఈ మూవీ వసూళ్ల పరంగానూ ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది. ఈ మూవీ తో పాపులర్ అయిన నవీన్ పొలిశెట్టితోసినిమాలు చేయాలని బడా ప్రొడక్షన్ కంపనీలు ప్లాన్ చేస్తున్నాయి.
త్వరలో యువీ క్రియేషన్స్ అనుష్క ప్రధాన పాత్రలో నిర్మించబోతున్న చిత్రంలో నవీన్ పొలిశెట్టి నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఛేంజెస్ ప్రస్తుతం జరుగుతున్నాయి. దీనితో పాటు దిల్ రాజు ప్రొడక్షన్స్లో ఓ సినిమా, సితార ఎంటర్టైన్మెంట్స్లో ఓ సినిమా చేయబోతున్నారట. ఇదిలా వుంటే ఈ మూవీలతో పాటు నవీన్ పొలిశెట్టికి మరో బంపర్ ఆఫర్ లభించినట్టు తెలిసింది.
అది కూడా సూపర్స్టార్ మహేష్ నుంచి అని తెలిసింది. మహేష్ ప్రస్తుతం అడివి శేష్ హీరోగా సోనీ పిక్చర్స్తో కలిసి `మేజర్` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ చివరి దశకు చేరుకుంది. ఇదే బ్యానర్పై నవీన్ పొలిశెట్టితో ఓ మూవీ చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నారట. దీంతో నవీన్ పొలిశెట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.