2019వ సంవత్సరానికి గానూ సోమవారం 67వ జాతీయ పురస్కారాల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తాను చాటాయి. ఇదిలా వుంటే ఈ అవార్డుల్లో బాలీవుడ్ చిత్రం `చిచ్చోరే` ఉత్తమ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఇందులో తెలుగు హీరో నవీన్ పొలిశెట్టి వన్ ఆఫ్ ది కీ రోల్లో నటించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కీలక పాత్రలో మెయిన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.
సుశాంత్ నటించిన ఈ చిత్రానికి నేషనల్ అవార్డు దక్కడంతో నవీన్ పొలిశెట్టి ఎమోషనల్ అయ్యాడు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. `ఓ వైపు చిచ్చోరే`కు జాతీయ అవార్డు దక్కడం, మరో వైపు తాను నటించిన `జాతిరత్నాలు` బ్లాక్ బస్టర్ హిట్ కోట్టడం గురించి ప్రస్తావించి భావోద్వేగానికి లోనయ్యాడు.
`ఓ వైపు `చిచ్చోరే`కు జాతీయ అవార్డు వచ్చింది. మరో వైపు `జాతిరత్నాలు` బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సుశాంత్ నువ్వు ఇదంతా చూస్తున్నావని నాకు తెలుసు. ఇది నీకే సొంతం. భాయ్ నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను` అంటూ నవీన్ పొలిశెట్టి సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. గత ఏడాది జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్సదంఆ మృతి చెందిన విషయం తెలిసిందే.
#Chhichhore wins the National award for Best Hindi film. And #JathiRatnalu is a blockbuster. I know you are watching Sushant. This one is for you . Miss you bhai ❤️ congratulations to Nitesh sir , maya , Derek , bewda, mummy , Sexa and the whole team. Love , Acid ❤️ pic.twitter.com/ZWri1ebrGJ
— Naveen Polishetty (@NaveenPolishety) March 23, 2021