న్యాచురల్ స్టార్ నాని నటించిన గత రెండు సినిమాలు ఓటిటిలోనే విడుదలయ్యాయి. వీటికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈసారి నాని తన చిత్రాన్ని థియేటర్ లోనే విడుదల చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. నాని నటించిన లేటెస్ట్ సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో చిత్రముంది.
దసరా సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ తో పాటు విడుదల గురించి అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా తెలియజేసారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత నాని చిత్రం థియేటర్లలో సందడి చేయబోతోంది. అయితే డిసెంబర్ లో ఏ తేదీని ఫిక్స్ చేశారన్నది ఇంకా అప్డేట్ ఇవ్వలేదు.
డిసెంబర్ 17న పుష్ప ది రైజ్ రూపంలో పెద్ద చిత్రం నుండి పోటీ ఉంది. సాయి పల్లవి, కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. రాహుల్ సంకిట్ర్యాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రంలో నాని రెండు భిన్న షేడ్స్ లో కనిపిస్తాడు. శ్యామ్ సింగరాయ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.