స్టార్ డైరెక్టర్గా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు సుకుమార్. ప్రస్తుం ఆయన అల్లు అర్జున్ హీరోగా `పుష్ప` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ పక్క భారీ చిత్రాలు చేస్తూనే తన వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన తన శిష్యుల్ని దర్శకులుగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతల్ని తీసుకుంటున్నారు. ప్రస్తుతం `ఉప్పెన` చిత్రంతో బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.
మరో శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ తో `18 పేజెస్` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుక్కు టీమ్ నుంచి వీళ్ల తరహాలోనే మరో శిష్యుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ త్వరలో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. నాని హీరోగా నటించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే శ్రీకాంత్ హీరో నానికి స్టోరీ వినిపించారట.
స్టోరీ కొత్తగా వుండటంతో ఈ చిత్రాన్ని చేయడానికి నేచురల్ స్టార్ నాని గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. కాగా ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై దర్శకుడు సుకుమార్ నిర్మించనున్నారట. ప్రస్తుత లాక్డౌన్ ముగిసిన తరువాత ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. నాని ప్రస్తుతం వి, శ్యామ్ సింగ్రాయ్, టక్ జగదీష్ చిత్రాల్లో నటిస్తున్నారు.