తెలుగునాట కూడా బయోపిక్ ల రాజ్యం మొదలయ్యింది . ఇప్పటికే మహానటి సంచలన విజయం సాధించగా సెట్స్ మీద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ సైరా …. నరసింహారెడ్డి ఉంది ఇక సెట్స్ మీదకు వెళ్ళడానికి ఎన్టీఆర్ బయోపిక్ రెడీ అవుతోంది అలాగే వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కూడా తెరకెక్కుతోంది అంతేకాదు మరో రెండు మూడు బయోపిక్ ల ఆలోచన చేస్తున్నారు . తాజాగా స్టూవర్టుపురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వర్ రావు బయోపిక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
స్టూవర్టుపురం గజదొంగ గా అప్పట్లో భయానక వాతావరణాన్ని సృష్టించిన చరిత్ర టైగర్ నాగేశ్వర్ రావు ది , దాంతో అతడి సినిమా చేయాలనీ భావించారు . కథ కూడా సిద్ధమైంది కానీ ఆ బయోపిక్ లో నటిస్తానని చెప్పిన రానా అర్దాంతరంగా తప్పుకున్నాడు . దాంతో నాని తో ఆ సినిమా చేయాలనీ భావించారట దర్శక నిర్మాతలు . ఇంకేముంది నాని కి ఆ కథ చెప్పడం అతడికి నచ్చడం చక చకా జరిగిపోయాయి .