`ఎంసీఏ` చిత్రంలో ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్నిగారు అంటూ సందడి చేశారు నేచురల్ స్టార్ నాని, నేచురల్ పెర్ఫార్మర్ సాయిపల్లవి. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. త సినిమా తరువాత త్వరలో మరోసారి ఈ ఇద్దరూ కలిసి మ్యాజిక్ చేయబోతున్నారట. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో `టక్ జగదీష్` పేరుతోరూపొందుతున్న చిత్రంలో నాని నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాతో పాటు నాని మరో రెండు చిత్రాల్ని లైన్లో పెట్టారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఒకటి, `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో మరో సినిమా. ఈ చిత్రాన్ని హారిని అండ్ హాసిక క్రియేషన్స్ బ్యానర్పై ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్నారు. సరికొత్త నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
త్వరలోనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఇందులో నానికి జోడీగా సాయి పల్లవిని అనుకుంటున్నారట. ఇటీవలే దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ ఆమెకు కథ వినిపించాడని, లైన్, తన పాత్ర నచ్చడంతో సాయి పల్లవి గ్రీన్సిగ్నల్ ఇచ్చేసిందని తాజాగా తెలిసింది. సాయి పల్లవి ప్రస్తుతం `విరాటపర్వం` చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే కేరళ షెడ్యూల్ని పూర్తి చేశారు. సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.