Homeటాప్ స్టోరీస్మ‌ణిర‌త్నం వెబ్ సిరీస్‌కి మ‌న వాళ్లు దూరం!

మ‌ణిర‌త్నం వెబ్ సిరీస్‌కి మ‌న వాళ్లు దూరం!

మ‌ణిర‌త్నం వెబ్ సిరీస్‌కి మ‌న వాళ్లు దూరం!
మ‌ణిర‌త్నం వెబ్ సిరీస్‌కి మ‌న వాళ్లు దూరం!

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా వినిపిస్తున్న పేరు ఓటీటీ. న్యూ క‌మ‌ర్స్ నుంచి స్టార్ డైరెక్ట‌ర్‌ల వ‌ర‌కు ఓటీటీకే ప్ర‌స్తుతం సై అంటున్నారు. క‌రోనా పుణ్య‌మా అని ఓటీటీల పంట పండుతోంది. థియేట‌ర్లు రీ ఓపెన్ కాక‌పోవ‌డంతో చిన్నా, పెద్దా అంతా వినోదం కోసం ఓటీటీల బాట‌ప‌డుతున్నారు. దీంతో చాలా మంది ఓటీటీలవైపు అడుగులు వేస్తున్నారు.

తాజాగా హీరో సూర్య `న‌వ‌ర‌స‌` పేరుతో ది గ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్న వెబ్ సిరీస్‌లో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. దీనికి తొమ్మిది మంది ద‌ర్శ‌కులు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇందులో న‌టించ‌డానికి ఇప్ప‌టికే హీరో సూర్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ సిరీస్‌లో న‌టించ‌డానికి తెలుగు హీరోలు మాత్రం ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ట‌.

- Advertisement -

ఇప్ప‌టికే నాని, నాగ‌చైత‌న్య వంటి హీరోల‌ని సంప్ర‌దించినా వారు ఓటీటీ అంటే విముఖ‌త‌ను చూపిస్తున్నార‌ని టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అర‌వింద‌స్వామి, సిద్ధార్థ వంటి స్టార్స్ సూర్య‌తో క‌లిసి న‌టించ‌డానికి అంగీక‌రించినా మ‌న వాళ్లూ మాత్రం ఆస‌క్తి చూపించ‌డం లేద‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All