జనమంతా కరోనా మహమ్మారికి భయపడుతూ బిక్కు బిక్కు మంటూ జీవితాన్ని వెళ్లదీస్తుంటే వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం రోమ్ నగరం తగలడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు వ్యవహరిస్తుండటం పలువురికి ఆగ్రహాన్ని, అసహనాన్ని తెప్పిస్తోంది. కరోనా కారణంగా థియేటర్లు మూసి వేయడంతో మేకర్స్ ఇబ్బంది పడుతుంటే వర్మ మాత్రం బీ గ్రేడ్ సినిమాలతో ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాడు.
తొలిప్రయత్నంగా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో `క్లైమాక్స్` పేరుతో ఓ సినిమాని వదిలిన వర్మ `కరోనా`పై కూడా ఓ చిత్రాన్ని లాక్డౌన్ సమయంలోనే తెరకెక్కించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తరువాత వెంటనే మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్యని కథావస్తువుగా తీసుకుని వర్మ చేసిన చిత్రం `మర్డర్`. కుటుంబ కథా చిత్రం` అని క్యాప్షన్.
ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ని వర్మ ఫాదర్స్డే సందర్భంగా ఆదివారం విడుదల చేయడంతో కొంత మంది వర్మపై సంచలన కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత, రైటర్ నందిని సిద్ధారెడ్డి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. `మర్డర్` పోస్టర్ని రీ ట్వీట్ చేసిన నందిని సిద్ధారెడ్డి `వర్మ శవాలపై చిల్లర ఏరుకునే వాడని ఘాటుగా విమర్శలు గుప్పించడం టాలీవుడ్లో సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్స్ కూడా చాలా మంది వెంకట్ సిద్దారెడ్డికి సపోర్ట్గా నిలవడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
MURDER film meanders between 3 moral dilemmas 1.on limit of a father’s control over his child 2.should a daughter be ignored even if she’s presumably ignorant about what’s good for her? 3.Can it be justified to take someone’s life in order to better someone else’s life? pic.twitter.com/FywyOX5BFd
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2020