సమంత కీలక పాత్రలో నటించిన చిత్రం `ఓ బేబీ`. కొరియన్ సినిమా ఆధారంగా రూపొందిన ఈ చిత్రం నందిని రెడ్డికి మంచి విజయంతో పాటు వరుస ఆఫర్లని అందిస్తోంది. `లస్ట్ స్టోరీస్`లోని ఓ భాగాన్నితెలుగు వెర్షన్లో తెరకెక్కించే ఛాన్స్ని సొంతం చేసుకున్న నందినిరెడ్డి తాజాగా మరో ఆఫర్ని సొంతం చేసుకుంది. మెగా హీరో సాయిధరమ్తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ `ఉప్పెన` సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా రిలీజ్కు సిద్ధమవుతున్న సందర్భంగా తాజాగా మరో చిత్రాన్ని వైష్ణవ్తేజ్ అంగీకరించినట్టు తెలిసింది. ఈ చిత్రానికి నందినిరెడ్డి దర్శకత్వం వహించబోతోంది. ఓ కొత్త తరహా కథతో తెరపైకి రానున్న ఈ చిత్రాన్ని సి. అశ్వనీదత్ కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్నదత్ నిర్మించనున్నారట. `లస్ట్ స్టోరీస్`కు సంబంధించిన తెలుగు వెర్షన్ పూర్తి కాగానే నందిని రెడ్డి తన కొత్త చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తారని తెలిసింది.
వైష్ణవ్తేజ్ హీరోగా పరిచయమవుతున్న `ఉప్పెన` విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రీమూవీమేకర్స్తో కలిసి కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ జాలరి జీవితం నేపథ్యంలో రూపొందుతున్నఈ చిత్రం ద్వారా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.