సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం `ఓ బేబీ`. కొరియన్ చిత్రం `మిస్ గ్రానీ` ఆ ధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి. సురేష్బాబు నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి సమంతకు, దర్శకురాలు నందినిరెడ్డికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత నందినిరెడ్డి నెట్ఫ్లిక్స్ కోసం `లస్ట్ స్టోరీస్` వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్కి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవలే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది. ఈ వెబ్ సిరీస్ తరువాత నందినిరెడ్డి సినిమా చేయబోతోంది. ఇందులో నాగచైతన్య హీరోగా నటించబోతున్నారు. స్వప్న సినిమా బ్యానర్పై ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో సమంత హీరోయిన్గా నటించే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది. అయితే అది నిజం కాదని నందిని రెడ్డి క్లారిటీ ఇచ్చింది.
`నేను చేయబోతున్న నెక్ట్స్ ఫిల్మ్ రీమేక్ కాదు. ఒరిజినల్ స్క్రిప్ట్తో చేయబోతున్నాను. సమంతతో మళ్లీ కలసి చేస్తే ఆనందంతో ర్వంగా ప్రకటిస్తాను. కానీ ఈ సారి ఇద్దరం కలిసి చేయడం లేదు. అని వెల్లడించింది. ఇప్పటికే నందిని రెడ్డితో సినిమా చేయాడానికి నాగచైతన్య ఓకే చెప్పినట్టు తెలిసింది. మరి హీరోయిన్ ఎవరుంటారు?… ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది వంటి విషయాల్ని త్వరలోనే వెల్లడించనున్నారట.