ఓ బేబీ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను సాధించింది దర్శకురాలు నందిని రెడ్డి. అంత పెద్ద విజయం సాధించిన తర్వాత కూడా నందిని తన నెక్స్ట్ సినిమా కోసం బ్రేక్ తీసుకుంది. నందిని రెడ్డి తన నెక్స్ట్ సినిమాను మొత్తానికి అనౌన్స్ చేసింది. నిజానికి నాగ చైతన్య హీరోగా నందిని రెడ్డి సినిమా చేయాలనుకుంది కానీ అది వర్కౌట్ కాలేదు.
ఇప్పుడు తన తర్వాతి చిత్రంలో హీరోగా ఏక్ మినీ కథ హీరో సంతోష్ శోభన్ ను ఎంచుకుంది. నందిని రెడ్డితో తరుచుగా పనిచేసే మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించనుంది. అలాగే వెన్నెల కిషోర్, రావు రమేష్, గౌతమి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకత్వం వహిస్తాడు.
స్వప్న సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దీనికి ఆసక్తికర టైటిల్ గా అన్నీ మంచి శకునములేను ఎంచుకున్నారు.
To some new beginnings… ఇక అన్నీ మంచి శకునములే ❤️#AnniManchiSakunamulehttps://t.co/FRtdGGA17Q@santoshshobhan @MalvikaNairOffl @nandureddy4u @MickeyJMeyer @KurapatiSunny @SwapnaCinema @SwapnaDuttCh #PriyankaDutt #MitraVindamovies pic.twitter.com/JOKhZW1jfM
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 5, 2021