కొద్దిరోజుల కిందట టాలీవుడ్ చెప్పిందే నేడు నిజమైంది . ఈరోజు సాయంత్రంతో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. కూకట్ పల్లి నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గా నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్క సుహాసిని నామినేషన్ వేసినప్పుడు కానీ , ప్రచార సమయంలో కానీ తమ్ముళ్లు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు రాలేదు దాంతో అక్కకు నాన్న లేరు తమ్ముళ్లు రారు అన్న శీర్షికతో ఓ వ్యాసం రాసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే నిజమయ్యింది. ఈరోజు ప్రచారం ముగిసిపోవడంతో తమ్ముళ్లు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ రాలేదు అన్న విషయం తేలిపోయింది.
అక్క పోటీ చేస్తున్నప్పుడు ఆమె గెలుపు కోసం ప్రచారం చేయాల్సిన బాధ్యత తమ్ముళ్లది , కానీ ఆ బాధ్యతని విస్మరించారు ఇద్దరు తమ్ముళ్లు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు. ఇదే హరికృష్ణ బ్రతికి ఉంటే తప్పకుండా కూతురు కోసం రథసారథి అయి ప్రచారం చేసేవాడు. కానీ హరికృష్ణ లేడుగా…… ఇలాంటి పరిస్థితుల్లో తమ్ముళ్లు అండగా ఉండాల్సింది పోయి ప్రచారానికి దూరంగా ఉన్నారు. చంద్రబాబు మీద కోపంగా ఉంటే అసలు అక్క ని పోటీ చేయించకుండా ఉండాల్సింది .కానీ ఆ పని చేయలేదు , అందుకే తమ్ముళ్లు ఉండి కూడా లేనిదయ్యింది నందమూరి సుహాసిని. నాన్న లేడు , తమ్ముళ్లు రాలేదు మరి ఓటు వేసే ప్రజలు సుహాసినిని అక్కున చేర్చుకుంటారా ? లేదా ? అన్నది ఈనెల 7న తేలనుంది. 11 న ఫలితం రానుంది.
English Title: Nandamuri Suhasini has no brothers