Homeగాసిప్స్తనపై వచ్చిన ట్రోల్స్ కు సమాధానం చెప్పనున్న బాలయ్య

తనపై వచ్చిన ట్రోల్స్ కు సమాధానం చెప్పనున్న బాలయ్య

nandamuri balakrishna to face trolls with his pics
nandamuri balakrishna to face trolls with his pics

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 105వ చిత్రం రూలర్ చిత్ర షూటింగ్ పనులతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలకు ముస్తాబవుతోంది. ఇంకా 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకు ముహూర్తం చేసేసి కూడా చాలా రోజుల పాటు షూటింగ్ కు వెళ్ళలేదు. దీనికి కారణాలు తెలియదు కానీ రెండు నెలల క్రితమే షూటింగ్ మొదలైంది. మొదట థాయిలాండ్ లో భారీ షెడ్యూల్ చేసారు. తర్వాత హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని యాక్షన్ ఘట్టాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.

దసరాకు ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఫస్ట్ లుక్ ను వదిలారు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ గా బాలకృష్ణ లుక్ ను ఐరన్ మ్యాన్ టోనీ స్టార్క్ ను పోలి ఉన్నా బాలయ్యకు మాత్రం పెర్ఫెక్ట్ గా సరిపోయింది అంటున్నారు అభిమానులు. ఈ చిత్రంతో బాలయ్య బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆశించారు అతని అభిమానులు. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ బయోపిక్ ను తీసి దారుణంగా దెబ్బ తిన్నాడు. అటు ఫైనాన్షియల్ గా, ఇటు ఎమోషనల్ గా ఈ చిత్రం బాలకృష్ణకు వేదనను మిగిల్చింది. భారీ నష్టాలతో హీరోగానూ బాలయ్య కొన్ని స్టెప్స్ వెనక్కి వెళ్లిపోయాడనే చెప్పాలి.

- Advertisement -

అందుకే కచ్చితంగా హిట్ కొట్టాలని, తనతో జై సింహా తీసిన కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ చిత్రాన్ని చేస్తున్నాడు. దసరాకు వచ్చిన లుక్ తో పాజిటివ్ అంచనాలని పెంచిన బాలయ్య, దీపావళికి విడుదలైన లుక్ తో మాత్రం ట్రోల్స్ ను ఎదుర్కొన్నాడు. బాలకృష్ణకు ట్రోల్స్ ఎదుర్కోవడం కొత్తేమి కాదు. చాలా సందర్భాల్లో బాలయ్యను ట్రోల్స్ చేస్తూ వచ్చారు. అయితే ఈసారి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా కామెంట్ చేసారు. దీపావళికి విడుదలైన ఈ పోస్టర్ లో బాలయ్య పోలీస్ పాత్రలో కనిపించాడు. సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ లుక్ లో అందరినీ ఆకట్టుకున్న బాలయ్య ఈ లుక్ తో మాత్రం మీమ్ పేజెస్ కు ఉపయోగపడ్డాడు. మినిమం కేర్ తీసుకోకుండా వదిలిన ఈ పోస్టర్ మీద వచ్చిన ట్రోల్స్ బాలయ్య దృష్టికి వెళ్లాయి కూడా. అందుకే వీటిని ఎదుర్కోవడానికి నందమూరి బాలకృష్ణ కొత్త ప్లాన్ వేసాడు.

త్వరలో నందమూరి బాలకృష్ణకు చెందిన ఈ చిత్రంలోని కొన్ని పిక్స్ ను విడుదల చేస్తారట. అయితే ది బెస్ట్ అనుకునే స్టిల్స్ నే విడుదల చేసి అటు ఫ్యాన్స్, ఇటు యాంటీ ఫ్యాన్స్ ను తృప్తి పరచాలని బాలయ్య చిత్ర టీమ్ ను ఆదేశించినట్లు తెలుస్తోంది. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో భూమిక, జయసుధ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. మరి ఈ చిత్రంతోనైనా హిట్ కొట్టి తన పనైపోలేదని బాలయ్య నిరూపించుకోగలడా?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All