కింగ్ నాగార్జున మెగా ప్రొడ్యూసర్, మాస్టర్ మైండ్ అల్లు అరవింద్కు కండీషన్ పెట్టారా?.. అయితే అదేంటి? .. ఎందుకు పెట్టారు అన్నది ఆసక్తికరంగా మారింది. కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ఇప్పటి వరకు మూడు చిత్రాల్లో హీరోగా నటించారు. తొలి చిత్రం `అఖిల్` డిజాస్టర్ల జాబితాలో కలిసిపోయింది. ఆ తరువాత చేసిన `హలో` , మిస్టర్ మజ్న చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయాయి.
కెరీర్ ప్రారంభించి నాలుగేళ్లు దాటినా ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. దీంతో అక్కినేని నాగార్జున అఖిల్ కు హిట్ కోసం మెగా క్యాంప్లోకి తీసుకొచ్చారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నచిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది.
ఇదిలా వుంటే ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయకూడదని నాగార్జున కండీషన్ పెట్టారట. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రాన్ని థియేటర్స్లోనే రిలీజ్ చేయాలన్నది నాగార్జున కండీషన్. ఆ కండీషన్ ప్రకారమే అఖిల్ చేత ఈ సినిమా చేయించారట. అల్లు అరవింద్ కూడా ఈ కండీషన్ని అంగీకరించారని, ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీటీ ప్లాట్ ఫామ్లో రిలీజ్ చేయమని మాటిచ్చారట.