నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన చిత్రం `సోగ్గాడే చిన్నినాయనా`. 2016 సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించి కింగ్ నాగ్ని 50 కోట్ల క్లబ్లో ఎంటరయ్యేలా చేసింది. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రాన్ని కల్యాణ్ కృష్ణ తెరకెక్కించారు. రామ్మోహన్ .పి కథ అందించిన ఈ చిత్రానికి సీక్వెల్ని చేయాలని గత మూడేళ్లుగా నాగార్జున ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.
కానీ కథ పర్ఫెక్ట్గా రాకపోవడంతో గత కొంత కాలంగా మార్పులు చేర్పులూ చేస్తూ వస్తున్నారు. తాజాగా స్క్రిప్ట్ లాకైంది. దీంతో ఈ సీక్వెల్ని `బంగార్రాజు` పేరుతో తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. జూన్ లేదా జూలైలో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకురావాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు.
2022 సంక్రాంతికి `బంగార్రాజు`తో బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని కింగ్ నాగార్జున `వైల్డ్ డాగ్` ప్రెస్ మీట్లో వెల్లడించారు. నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. ఈ మూవీ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదీ థియేటర్లలో విడుదల కాబోతోంది.