Homeన్యూస్కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా అడ‌విని ద‌త్త‌త తీసుకున్న నాగార్జున

కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా అడ‌విని ద‌త్త‌త తీసుకున్న నాగార్జున

కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా అడ‌విని ద‌త్త‌త తీసుకున్న నాగార్జున
కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా అడ‌విని ద‌త్త‌త తీసుకున్న నాగార్జున

కింగ్ నాగార్జున అన్నమాట నిలబెట్టుకున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో  1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపిన నాగార్జున…ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా మేడ్చ‌ల్ జిల్లా చెంగిచెర్ల‌లోని అడవిని దత్తత తీసుకున్నారు.

భార్య అక్కినేని అమ‌ల‌, కొడుకులు నాగ చైతన్య , అఖిల్ లతో పాటు కుటుంబ సభ్యులందరితో కలిసి చెంగిచెర్ల‌లోని అడవిని పరిశీలించారు. ఈ అడవికి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అర్బ‌న్ ఫారెస్ట్ గా శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య క్రమానికి మంత్రి మ‌ల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌ లు హాజరయ్యారు.

- Advertisement -

ఇక యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సైతం రెండేళ్ల క్రితం హైదరాబాద్ కు సమీపంలో ఉన్న కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో 1,650 ఎకరాల ఆటవీ భూమిని అడాప్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పనులకు శంకుస్థాపన చేశారు. అడవి సంరక్షించడానికి ప్రభాస్ తొలిగా రూ.2 కోట్లు సాయం అందించారు. సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ స్ఫూర్తితో, పర్యావరణ మేలు కోసం తన వంతు సామాజిక బాధ్యతగా రిజర్వు అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రభాస్ తెలుపడం జరిగింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All