Homeటాప్ స్టోరీస్వైర‌ల్‌గా మారిన నాగ‌బాబు ట్వీట్!

వైర‌ల్‌గా మారిన నాగ‌బాబు ట్వీట్!

వైర‌ల్‌గా మారిన నాగ‌బాబు ట్వీట్!
వైర‌ల్‌గా మారిన నాగ‌బాబు ట్వీట్!

నాథూరాం గాడ్సే నిజ‌మైన దేశ‌భ‌క్తుడంటూ మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ట్వీట్ చేయ‌డంపై పెద్ద దుమారం చెల‌రేగింది. మంగ‌ళ‌వారం ఆయ‌న చేసిన ట్వీట్ వివాదంగా మారింది. నాథూరాం గాడ్సే `ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు అత‌డు నిజ‌మైన దేశ భ‌క్తుడు. గాంధీని చంప‌డం క‌రెక్టా కాదా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశం` అని ట్వీట్ చేయ‌డంతో నెటిజ‌న్స్ ఆయ‌న‌పై విరుచుకుప‌డ్డారు. మ‌హాత్మా గాంధీని చంపిన గాడ్సే దేశ భక్తుడు ఎలా అవుతాడ‌ని ప‌లువురు నాగ‌బాబుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

త‌న వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో నాగ‌బాబు వివ‌ర‌ణ ఇచ్చారు. నాథూరాం గాడ్సే నేరాన్ని స‌మ‌ర్ధించ‌డం త‌న ఉద్దేశ్యం కాద‌ని, గాంధీ అంటే త‌న‌కు అపార‌మైన గౌర‌వ‌మ‌ని చెప్పారు. ఇదిలా వుంటే తాజాగా రాముల‌మ్మ విజ‌య‌శాంతి కూడా ప‌రోక్షంగా నాగ‌బాబుపై విమ‌ర్శ‌లు కురిపించారు. నాగ‌బాబు పేరుని నేరుగా ప్ర‌స్థావించ‌ని రాముల‌మ్మ మ‌హాత్ముడిపై ఈ సంద‌ర్‌భంగా ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

`కుల‌, మ‌తాలు వేఊరైనా దైవం ఒక్క‌టే.. ఎన్ని త‌రాలైనా జాతిపిత ఒక్క‌డే… 130 కోట్ల మంది భార‌తీయుల‌కు మ‌హాత్ముడు ఒక్క‌డే.. ఈశ్వ‌ర్ అల్లా తేరేనామ్ స‌బ్‌కో దే భ‌గ‌వాన్ .. నాకు కూడా అని గాడ్సే ఇప్పుడు బ్ర‌తికుంటే ఈ జ‌న్మ‌దినం నాడు ఇదే ప్రార్థించేవాడు. మన్నించండి మ‌హాత్మా..`అని ట్వీట్ చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All