కొణిదెల నిహారిక, జొన్నలగడ్డ చైతన్య వివాహ హంగామా ఉదయపూర్లో ప్రారంభమైంది. ఈ వివాహ వేడుక కోసం ఒక్కొక్క మెగా ఫ్యామిలీ ప్రత్యేక విమానంలో రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చేరుకుంది. మెగాస్టార్, రామ్చరణ్, సురేఖ, ఉపాసన, అల్లుళ్లు, కూతుళ్లు అంతా కలిసి ప్రత్యేక విమానంలో ఉదయ్పూర్ చేసుకున్నారు. అల్లు ఫ్యామిలీ కూడా ప్రత్యేక విమానంలో ఉదయ్పూర్ వెళ్లింది.
అయితే పవర్స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం చివరి నిమిషం దాకా వెళ్లలేదు. దీంతో ఆయన నిహారిక పెళ్లికి హాజరు కావడం కష్టమనే పుకార్లు షికారు చేయడం మొదలైంది. ఆగస్టులో జరిగిన ఎంగేజ్మెంట్కి కూడా పవన్ హాజరు కాలేదని, పెళ్లికి కూడా హజరు కావడం కష్టమనే వార్తలు మొదలయ్యాయి. అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ పవన్కల్యాణ్ మంగళవారం పబేగంపేట్ ఏయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉదయ్పూర్ చేరుకున్నారు.
పవన్ ఎంగేజ్మెంట్కి హాజరు కాలేదని గ్రమించిన నిహారిక పెళ్లికి మాత్రం ఖచ్చితంగా వుండాలని మాటతీసుకుందట. ఆ మాట ప్రకారమే పవన్ ఉదయ్పూర్ ఒక్క రోజు ముందు చేరుకున్నారు. రాడేమో అనుకున్న తమ్ముడు రావడంతో మెగా బ్రదర్ నాగబాబు ఎమోషనల్ అయ్యారు. తమ్మేఉడి రాకని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా స్పందించి మురిసిపోయారు. `ఈ క్షణం పూర్తి కావడానికి, చివరి ఆనందం కూడా వచ్చింది` అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.