Homeటాప్ స్టోరీస్ఛలో దర్శకుడిపై శౌర్య సంచలన విమర్శలు

ఛలో దర్శకుడిపై శౌర్య సంచలన విమర్శలు

ఛలో దర్శకుడిపై శౌర్య సంచలన విమర్శలు
ఛలో దర్శకుడిపై శౌర్య సంచలన విమర్శలు

యంగ్ హీరో నాగ శౌర్య నటించిన లేటెస్ట్ సినిమా అశ్వద్ధామ ఇప్పుడు డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. నాగ శౌర్య స్వయంగా ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. కథతో పాటు మాస్ హీరోగా తన తొలి ప్రయత్నం కూడా విజయవంతమైందని చెప్పాలి. అశ్వద్ధామ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ తో ఫుల్ హ్యాపీగా ఉన్న శౌర్య తన మేజర్ హిట్ ఛలో చిత్ర దర్శకుడు వెంకీ కుడుములపై సంచలన ఆరోపణలు చేసాడు.

నిజానికి నాగ శౌర్య కెరీర్ ను ఛలో కు ముందు, తర్వాతగా విభజించవచ్చు. తన మార్కెట్ కూడా ఈ చిత్రం ద్వారా డబల్ అయింది. ముఖ్యంగా ఛలో సినిమా ద్వారానే యూత్ కు చేరువయ్యాడు శౌర్య. అసలు ఇంతకీ ఆ చిత్ర దర్శకుడు వెంకీ కుడుములతో శౌర్యకి ఉన్న వివాదమేంటి? వీరిద్దరి మధ్యా ఏమైంది?

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో వివాదాలు, ఒకరిపై మరొకరికి మనస్పర్థలు అనేవి చాలా సాధారణం. అయితే ఎవరూ కూడా మా మధ్య వివాదం జరిగింది అని ఓపెన్ గా చెప్పరు. అయితే నాగ శౌర్య మాత్రం ఈ ఇష్యూని పబ్లిక్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకీ అసలు మ్యాటర్ లోకి వెళితే.. “జాదూగాడు సినిమాకు వెంకీ అసిస్టెంట్ డైరెక్టర్. నాలుగేళ్లుగా నాతో ట్రావెల్ చేస్తున్నాడు. తనకోసం సినిమా చేద్దామనిపించింది. అందుకే కథ రాసుకుని రమ్మన్నా. అయితే అది అస్సలు బాలేదు. అది తనతోనే చెప్పి, ఇద్దరం కలిసి ఛలో సబ్జెక్ట్ పై కూర్చున్నా. నిజానికి ఛలోకు నేను కూడా రైటర్ నే. అయితే నేను క్రెడిట్స్ తీసుకోకపోవడం నా తప్పే. సినిమా విడుదలయ్యాక వెంకీ అందుబాటులో లేడు. నేను గిఫ్ట్ ఇచ్చిన కార్ కూడా పక్కన పెట్టేసాడు. వాడట్లేదు. ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అయినా కూడా మా ఫ్యామిలీ అంతా స్తబ్దుగా ఉన్నాం. మా ఫ్యామిలీలో వెంకీని మరో కొడుకులా చూసేవాళ్ళు. నన్ను మోసం చేసినా ఒప్పుకుంటా. కానీ నా ఫ్యామిలీని బాధపెట్టాడు. తనను దగ్గరకు కూడా రానివ్వను” అంటూ అసలు విషయం చెప్పేసాడు.

ప్రస్తుతం వెంకీ దర్శకత్వం వహించిన భీష్మ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈ వివాదంపై వెంకీ రియాక్షన్ ఎలా ఉంటుందో!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All