యంగ్ హీరో నాగశౌర్య మునుసెన్నడూ లేనంతగా సినిమాల విషయంలో స్పీడు పెంచారు. వరుస ప్రాజెక్ట్లకు గ్రీన్ సిగ్నలిస్తూ షాకిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాలు వరుడు కావలెను, లక్ష్య చిత్రీకరణ దశలో వుండగానే ఇటీవల అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంబించిన నాగశౌర్య తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించారు.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నాగశౌర్య నటించనున్న 23వ చిత్రమిది. ఆయన పుట్టిన రోజు శుక్రవారం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ చిత్రానికి `పోలీసు వారి హెచ్చరిక` అనే టైటిల్ని ఖరారు చేశారు. గురువారం సాయంత్రం ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
వినూత్నమైన కథ, కథనాలతో రూపొందనున్న ఈ చిత్రం ద్వారా కె.పి. రాజేంద్ర దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కాబోతోంది.