అక్కినేని కాంపౌండ్ నుంచి రేసులో వున్న హీరో నాగచైతన్య. యుద్ధం శరణం, శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి వంటి వరుస ఫ్లాపుల తరువాత `మజిలీ`తో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన కిక్కుతో నాగచైతన్య వరుస చిత్రాల్ని లైన్లో పెట్టేశాడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో `లవ్స్టోరీ` చిత్రాన్ని చేస్తున్న చై వెంటనే మరో సినిమాని కూడా ఓకే చేసేశాడు. వరుణ్ తేజ్తో `గద్దలకొండ గణేష్` చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.
`గీత గోవిందం` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుల జాబితాలో చేరిపోయిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మేలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఇయర్ ఎండ్కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్కి తుదిమెరుగులు దిద్దుతున్నారు. అయితే ఈ సినిమాకు చైతూ ఏకంగా 8 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది.
ఇంతక ముందు 6 టు 7 మాత్రమే తీసుకునే నాగచైతన్య 14 ప్లస్ రీల్స్ సినిమాకు మాత్రం ఏకంగా 8 డిమాండ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. `వెంకీమామ` ఫరవాలేదనిపించినా చై మాత్రం యమ స్పీడుతో వున్నాడని. రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదని తెలిసింది.