`మజిలీ` తరువాత నాగచైతన్య సినిమాల ఎంపిక విషయంలో మార్పులు మొదలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న`లవ్స్టోరీ
అందులో పరశురామ్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ నిర్మించనున్న `నాగేశ్వరరావు`. దీనితో పాటు `మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని అంగీకరించారని తెలిసింది. కొత్త తరహా చిత్రాలకు విక్రమ్ కె. కుమార్ ప్రధాన్యత నిస్తుంటారు. ఇటీవల నానితో `గ్యాంగ్లీడర్` చిత్రాన్ని తెరకెక్కించిన విక్రమ్ త్వరలో నాగచైతన్యతో కొత్త తరహా చిత్రాన్ని ప్లాన్ చేసినట్టు తెలిసింది.
ఈ చిత్రానికి `థ్యాంక్యూ` అనే టైటిల్ని అనుకుంటున్నారట. ఇటీవలే నాగచైతన్యకు దర్శకుడు విక్రమ్కె కుమార్ కథ వినిపించారని, స్టోరీ కొత్తగా వుండటంతో నాగచైతన్య ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. పరశురామ్ సినిమా తరువాత ఈ చిత్రం సెట్స్పైకి రానున్నట్టు తెలిసింది.