ఈ మధ్య సినీ స్టార్స్ లలో చాల మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు మల్టీస్టారర్ చిత్రాలకు గాని ఇతర హీరోల చిత్రాల గురించి మాట్లాడడం కానీ చేసేవారు కాదు..కానీ ఇప్పుడు ఆలా కాదు మల్టీస్టారర్ చిత్రాలకు సై అంటూనే ఇతర హీరోల సినిమాల గురించి గొప్పగా చెపుతూ అభిమానులను సంతోష పరుస్తున్నారు. ఇక కరోనా లాక్ డౌన్ వల్ల ఓటిటి వెబ్ సిరీస్ లకు డిమాండ్ బాగా పెరిగింది. కొత్త దర్శకులు , కొత్త టెక్నీషన్స్ ఎంతోమంది ఓటిటి లలో పలు సినిమాలు , వెబ్ సిరీస్ లు తెరకెక్కించి సక్సెస్ సాధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అగ్ర నటి నటులు సైతం వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సమంత , తమన్నా , నితిన్ , రానా మొదలగువారు వెబ్ సిరీస్ లలో , ఓటిటి సినిమాల్లో నటించి మెప్పించగా..తాజాగా అక్కినేని నాగ చైతన్య సైతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.
మహాశివరాత్రి పండుగ సందర్భంగా మంగళవారం నాడు సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య తన డిజిటల్ ఎంట్రీకి సంబంధించిన విషయాన్ని వెల్లడించాడు. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పోస్ట్ను కూడా తన ఇన్స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోని పంచుకున్న చైతు.. దానికి ‘దూత స్టార్ట్స్’ అంటూ షేర్ చేశాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్కు ‘దూత’ అనే టైటిల్ను కన్ఫర్మ్ చేశారు. మొత్తం మూడు సీజన్లుగా ఈ వెబ్ సిరీస్ను రూపొందించబోతున్నారని, ఒక్కో సీజన్లో 8 నుంచి 10 ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న చైతు..వెబ్ సిరీస్ లలో కూడా రాణించాలని , మంచి సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.