అల్లరి నరేష్ హాస్య ప్రధాన చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపుని దక్కించుకున్నారు. అప్పుడప్పుడు తన పంథాకు భిన్నంగా ప్రయోగాలు చేస్తున్నారు. నేను, ప్రాణం చిత్రాలు అలా చేసినవే. తాజాగా అదే తరహాలో మళ్లీ పంథా మార్చి నరేష్ చేస్తున్న చిత్రం `నాంది`. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. వేగేశ్న సతీష్ నిర్మాత. నవమి హీరోయిన్గా పరిచయం అవుతోంది.
అల్లరి నరేష్ సరికొత్త పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 19న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అండర్ ట్రైల్ ఖైదీ వ్యథగా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ని సూపర్స్టార్ మహేష్ శనివారం ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా టీమ్ని అభినందించారు. “నాంది` ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా వుంది. చాలా ఇంటెన్స్గా వుంది. నరేష్కు, చిత్ర బృందానికి ఈ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లభించాలని` అన్నారు.
`
`రాజగోపాల్ గారిని నేను మర్దర్ చేయడం ఏంటి సర్. ఇప్పటి వరకు రాజగోపాల్ గారి గురించి వినటం తప్ప ఆయన గురించి నాకేమి తెలియదు సర్` అంటూ అల్లరి నరేష్ చెబుతున్న డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. వీడు మాటల్తో వినడు రెడ్డీ.. మా అబ్బాయికీ ఈ హత్యకూ ఎలాంటి సంబంధం లేదు..ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతున్న సూర్యప్రకాష్కి న్యాయం జరుగుతుందా?. అంటే టీవీల్లో బ్రేకింగ్స్.. చెయ్యని తప్పుకి నా క్లైంట్ సూర్యప్రకాష్ అండర్ ట్రైల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు` అంటూ నరేష్ తరుపున వాదించే లాయర్గా వరలక్ష్మీ శరత్కుమార్ కనిపిస్తోంది. నరేష్ చిత్రాల్లో విభిన్నమైన సినిమాగా ఈ మూవీ వుండబోతోందని ట్రైలర్ చెబుతోంది.
Happy to unveil the trailer of #Naandhi!! Looks intense… Wishing @allarinaresh and the entire team a blockbuster success. ?@vijaykkrishna @varusarath5 @SV2Enthttps://t.co/0NI8Aa51Hk
— Mahesh Babu (@urstrulyMahesh) February 6, 2021