యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న చిత్రం `చావు కబురు చల్లగా`. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ కార్తీకేయ బస్తీ బాలరాజు లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
కార్తికేయ ఇంట్రో, క్యారెక్టర్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కార్తికేయ గెటప్, డైలాగ్ డెలివరీ.. మాడ్యులేషన్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆడియన్స్ మళ్లీ మళ్లీ చూడాలనేంతగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి బజ్ని క్రియేట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మార్చి19న రిలీజ్ చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ ట్యూన్ చేసిన `మైనేమ్ ఈజ్ రాజు ` అంటూ సాగే ఫస్ట్ సింగిల్ని శనివారం చిత్ర బృందం విడుదల చేసింది. రేవంత్ పాడగా, కరుణాకర్ అడిగర్ల సాహిత్యాన్ని అందించారు. సినిమాలో కార్తికేయ మార్చురీ వ్యాన్ని నడిపే బస్తీబాలరాజు పాత్రలో నటిస్తున్నాడు. అతని పాత్రకి , నేపథ్యాన్ని పరిచయం చేస్తూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటోంది. మాస్ ఆడియన్స్ని ఆకట్టుకునే అంశాలున్న ఈ చిత్రం కార్తీకేయకు మరో హిట్ చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు.